హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐఎఫ్ఏ షీల్డ్ టోర్నమెంట్లో శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎస్డీఎఫ్సీ) ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన సెమీ ఫైనల్లో శ్రీనిధి క్లబ్ 2-1తో రైల్వేస్ ఎఫ్సీపై ఉత్కంఠ విజయం సాధించి తుదిపోరుకు చేరింది. హోరాహోరీగా సాగిన పోరులో శ్రీనిధి జట్టు తరఫున ఫాల్గుణి సింగ్ (3వ ని.లో), మల్సాంజులా (116వ ని.లో) చెరో గోల్ చేశారు. ఆట ఆరంభంలోనే శ్రీనిధి జట్టుకు ఆధిక్యం లభించగా.. కాసేపటికి రైల్వే జట్టు స్కోరు సమం చేసింది. దీంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలు కనిపించగా.. మరికాసేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా మల్సాంజులా గోల్ కొట్టడంతో శ్రీనిధి జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది.