తిరుపతి 20 జూన్ 2021: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం స్వామివారు వేణుగోపాల స్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు, కంకణబట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ గోపాల కృష్ణరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.