తిరుమల, మే 23: తిరుమల శ్రీవారి ఆలయంలో మే 25న మంగళవారం నృసింహ జయంతి జరుగనున్నది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు. వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల వసంత మండపంలో ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు శ్రీనరసింహస్వామి వారి పూజ నిర్వహిస్తారు.