హోబర్ట్: క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తాచాటి టీ20 ప్రపంచకప్ సూపర్-12కు అర్హత సాధించిన శ్రీలంక.. ఆదివారం ఐర్లాండ్పై ఘన విజయం సాధించింది. గ్రూప్-1లో భాగంగా జరిగిన పోరులో లంక 9 వికెట్ల తో ఐర్లాండ్ను చిత్తు చేసింది. మొదట ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. టెక్టర్ (45) టాప్ స్కోరర్ కాగా.. పాల్ స్టిర్లింగ్ (34) పర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో తీక్షణ, హసరంగ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లంక 15 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 133 రన్స్ చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కుశాల్ (68 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ధనంజయ (31), అసలంక (31) రాణించారు.