శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమాతో చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు కిషోర్. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి ఫిదా అయిపోతున్నారు. ఎలాంటి పక్కదారి పట్టకుండా తాను అనుకున్న కథను అనుకున్నట్లు చాలా బాగా తీసాడు అంటూ దర్శకుడిపై ప్రశంసల జల్లు కురిసింది. అయితే వసూళ్ల విషయానికి వచ్చేసరికి మాత్రం శ్రీకారం దారుణంగా నిరాశ పరిచింది. ఈ సినిమాతో మరో డిజాస్టర్ అందుకున్నాడు శర్వానంద్. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాకు కూడా కలెక్షన్స్ రాకపోవడంతో శర్వానంద్ నిరాశలో ఉన్నాడు. శివరాత్రికి వచ్చిన జాతి రత్నాలు దెబ్బకు శ్రీకారం వెనక్కి తగ్గింది. ఈ సినిమా ఏరియా వైజ్ క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు వచ్చేసింది..
నైజాం- 2.86 కోట్లు
సీడెడ్- 1.66 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.21 కోట్లు
ఈస్ట్- 0.74 కోట్లు
వెస్ట్- 0.50 కోట్లు
గుంటూరు- 0.99 కోట్లు
కృష్ణా- 0.53 కోట్లు
నెల్లూరు- 0.32 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 8.82 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.30 కోట్లు
ఓవర్సీస్- 0.52 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 9.64 కోట్లు
‘శ్రీకారం’ చిత్రానికి 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తొలిరోజు వచ్చిన టాక్ తో కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుందనే అనుకున్నారు. కానీ 17. 5 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం కేవలం 9.64 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. దాంతో డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా 7.86 కోట్ల భారీ నష్టాలను మిగిల్చింది. దాంతో శర్వానంద్కు ఇది వరుసగా 4వ డిజాస్టర్ కావడం గమనార్హం. ఈయన గత సినిమాలు జాను, రణరంగం, పడిపడి లేచే మనసు కూడా డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు శ్రీకారం జాబితాలో చేరిపోయింది.