బాసర: చదువుల తల్లి కొలువై ఉన్న బాసరలోని సర్వతీ ఆలయానికి శ్రావణ శోభ సంతరించుకున్నది. శ్రావన మాసం తొలి శుక్రవారం కావడంతో భక్తుల సందడి నెలకొన్నది. మంచి ముహూర్తంతో పాటు శ్రావణ మాసం తొలి శుక్రవారం, పంచమి సందర్భంగా అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. సుమారు 15 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి చెంత తమ మొక్కులు తీర్చుకున్నారు.