న్యూఢిల్లీ: భారత స్టార్ స్పింటర్ హిమాదాస్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పటియాలాలో నిర్వహిస్తున్న జాతీయ క్యాంప్నకు హాజరయ్యేందుకు వచ్చిన హిమాదాస్కు కొవిడ్-19 సోకినట్లు తేలింది. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ఐసొలేషన్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ‘కరోనా బారిన పడ్డాను. ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగ పరుచుకొని మునుపటి కంటే దృఢంగా తిరిగివస్తా’ అని బుధవారం 21 ఏండ్ల హిమాదాస్ ట్వీట్ చేసింది. అర్హత మార్క్ను దాటలేక టోక్యో ఒలింపిక్స్కు దూరమైన హిమ ఇటీవలే కండరాల గాయం నుంచి కోలుకొని తిరిగి ట్రాక్పై అడుగుపెట్టింది.