ఢిల్లీ,జూలై : ‘రుద్రాక్ష్’ ఇంటర్ నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్ వెన్షన్ సెంటర్ కు చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నవారణాసిలో ఆధునిక సాంకేతికతో నిర్మించారు. 1,200 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన రెండు అంతస్తుల కన్వెన్షన్ సెంటర్ను జపనీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) సహకారంతో నిర్మించారు. దాదాపు 200 కోట్ల వ్యయంతో మూడు ఎకరాల విస్తీర్ణంలో వారణాసిలోని సిగ్రా ప్రాంతంలో నిర్మించారు.
వారణాసి నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ‘రుద్రాక్ష్’ ఇంటర్ నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్ వెన్షన్ సెంటర్ ని ఏర్పాటుచేశారు. ఈ సెంటర్ లో అన్ని రకాల అంతర్జాతీయ సమావేశాలు, సంగీత కచేరీలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూనే అందుకు కావాల్సిన సదుపాయాల్ని అందించనున్నారు. విశాలమైన పార్కింగ్ ప్లేస్ ఉన్నది. ఇక్కడ 120 కార్లను పార్కింగ్ చేయడానికి వీలుంటుంది. ఈ ‘రుద్రాక్ష్’ ఇంటర్ నేషనల్ కో-ఆపరేషన్ ఎండ్ కన్ వెన్షన్ సెంటర్ ను ప్రధానీ మోడీ చేతులు మీదుగా రేపు ప్రారంభించనున్నారు.