హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. దసరా పర్వదినం సందర్భంగా ఈ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది.
సికింద్రాబాద్-తిరుపతి (రైలు నంబర్ 02764) మధ్య అక్టోబర్ 1వ తేదీ రాత్రి 8.05 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02763) మరుసటిరోజు సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయల్దేరి 3 వ తేదీ ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబ్నగర్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
సికింద్రాబాద్-యశ్వంతపూర్ (ట్రైన్ నంబర్ 07233) రైలు ఈ నెల 29, అక్టోబర్ 6, 13, 20 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాత్రి 9.45 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (ట్రైన్ నంబర్ 07234) ఈ నెల 30, అక్టోబర్ 7, 14, 21 తేదీల్లో యశ్వంతపూర్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
గుంటూరు డివిజన్ మీదుగా నరసాపూర్-సికింద్రాబాద్-నరసాపూర్ మీదుగా ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు సీనియర్ డీసీఎం ఆంజనేయులు తెలిపారు. నరసాపూర్-సికింద్రాబాద్ (నంబర్ 07466) రైలు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-నరసాపూర్ (నంబర్ 07467) రైలు అక్టోబర్ 1వ తేదీ రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నరసాపూర్ స్టేషన్కు చేరుతుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.