హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ నుంచి తిరుపతి, యశ్వంత్పూర్ స్టేషన్ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ప్రకటించారు. ఈ నెల 10, 11, 12, 13 తేదీల్లో ట్రైన్ నంబర్ల వారీగా వివరాలు తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రత్యేక రైలు కాజీపేట్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు. అలాగే యశ్వంత్పూర్కు వెళ్లే రైలు కాచిగూడ, ఉందానగర్, షాద్నగర్, గద్వాల్, డోన్, ధర్మవరం, హిందూపురం, యలహంకా స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.