హైదరాబాద్ : తిరుపతి నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్తో పాటు మరికొన్ని రైల్వే స్టేషన్ల మధ్య మొత్తం 12 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నామని బుధవారం దక్షిణ మధ్య రైల్వేజోన్ అధికారులు వెల్లడించారు. ఇందులో కాచిగూడ-యశ్వంత్పూర్, కాచిగూడ-పూరి, సికింద్రాబాద్-సంత్రగాచి, నాందేడ్ – విశాఖపట్నం, సికింద్రాబాద్- యశ్వంత్పూర్ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 28 నుంచి 30 తేదీలల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు.