హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ – తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 15 నుంచి 18 వరకు రాకపోకలు కొనసాగిస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. అలాగే నర్సాపూర్ – సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ రైళ్లు ఆగస్టు 13, 14, 15 తేదీలలో రాకపోకలు కొనసాగిస్తాయన్నారు.