హైదరాబాద్ : దసరా పండుగ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతి, యశ్వంత్పూర్ స్టేషన్ల మధ్య పది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు బుధవారం ఎస్సీఆర్ జోన్ అధికారులు వెల్లడించారు. దసరా ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 1 నుంచి 21వ తేదీ వరకు రాకపోకలు కొనసాగిస్తాయన్నారు. టిక్కెట్ రిజర్వేషన్లు, ఇతర వివరాల కోసం ఎస్సీఆర్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
హైదరాబాద్ – సీఎస్టీ ముంబై – హైదరాబాద్ ఎక్స్ప్రెస్ రైలును సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుగా మారుస్తూ బుధవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సూపర్ఫాస్ట్ రైలు నూతన టైంటేబుల్ను విడుదల చేశారు. ఈ వివరాలు ఎస్సీఆర్ వెబ్సైట్లో పొందుపరిచారు.