హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆయా మార్గాల్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే.. నర్సాపూర్ – సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. నర్సాపూర్-సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య ఒన్వే ప్రత్యేక రైలును ఏర్పాటు చేశామని, ఈ నెల 4న ఈ రైలు అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.