హైదరాబాద్ : దళితుల పక్షాన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి.. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. మాదిగ జేఏసీ, ఇతర దళిత సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నగరంలోని ట్యాంక్బండ్పై గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మిఠాయిలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.