హైదరాబాద్ : వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను వినియోగించనున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. ట్యాంక్బండ్పై వినాయక నిమజ్జనానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్బండ్పై సుందరీకరణ దెబ్బతినకుండా ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సారి నిమజ్జనానికి ఆటోమేటిక్ ఐడల్ రిలీజ్ సిస్టమ్ వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి ట్యాంక్బండ్పై క్రేన్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు చెప్పారు. ట్యాంక్బండ్పై 16, ఎన్టీఆర్ మార్గ్లో 12, పీపుల్స్ ప్లాజాలో 8 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, పెద్ద విగ్రహాలకు మాత్రమే ట్యాంక్బండ్పైకి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.