శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణార్థం స్వామిఅమ్మవార్లతో పాటు ఆలయంలోని పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈఓ లవన్న తెలిపారు. మంగళవారం ఉదయం ఆలయ అర్చక వేదపండితులు కుమారస్వామికి షోడష పూజాధి క్రతువులు నిర్వహించారు. సుబ్రహ్మణేశ్వరుడిని పూజించడంతో శత్రుభాద తొలిగి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపారు. అలాగే సంధ్యా సమయంలో నందిమండపంలోని శనగల బసవన్నకు పంచామృతాభిషేకాలతో ప్రత్యేక పూజలు చేసి, శనగలు నైవేద్యం సమర్పించారు. అనంతరం శివగణాధులకు అధిపతి, క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రునికి ప్రదోశ కాల పూజలు శాస్ర్తోక్తంగా జరిపించారు. ఆరుబయట దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయంచి విశేష పుష్పార్చనలు చేశారు.