జమ్మికుంట రూరల్ : హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలువాలని కోరుతూ మండల పరిధిలోని బిజిగిరిషరీఫ్ దర్గాల్లో వరంగల్ మహిళ కార్పొరేటర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. గ్రామంలో అదివారం మహిళ కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధికి ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రచారం జరిపారు. అనంతరం దర్గాకు చేరుకుని గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపుకోసం ప్రార్ధనలు జరిపారు.
ఈ సందర్భంగా మహిళ కార్పొరేటర్లు మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ నిలబెట్టిన ఉద్యమ నాయకుడు గెలువాలని దర్గాలో ప్రార్ధనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ కార్పొరేటర్లు జన్ను షీబారాణి, మునిగాల సరోజన, జక్కుల రజిత, దివ్యవాణి, మాజీ కార్పొరేటర్ శ్రీలతలు ఉన్నారు.