తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ ఏడాది ఏప్రిల్ 21 నుండి మే 31వ తేదీ వరకు ఆన్లైన్లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ దర్శన తేదీని మార్చుకునే వెసులుబాటు టీటీడీ కల్పించింది. అయితే సంవత్సరం లోపు ఒకసారి మాత్రమే ఈవిధంగా మార్పునకు అవకాశం ఉంటుంది.
కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.