నల్లగొండ : గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలతో కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుందన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మన ఊరు- మన బడి పథకం కింద 38 లక్షల రూపాయలతో గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల అభివృద్ధి పనులకు, గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులకు సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులు విజ్ఞప్తి మేరకు అభివృద్ధి పనుల కోసం తన నిధుల నుంచి 15 లక్షలు మంజూరు చేశానన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు.
దీంతో గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం అంగన్వాడీ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో మండలి చైర్మన్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.