హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు బసవేశ్వరుడు అంటే ఎంతో గౌరవమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కోకాపేటలో ఆదివారం ఆయన బసవ భవన్కు శంకుస్థాపన చేశారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ‘ఇవాళ చాలా మంచిరోజు. గాంధీజీ పుట్టిన రోజు. బసవేశ్వరుడికి, గాంధీజీకి దగ్గరి పోలికలుంటాయి. బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే సమానహక్కులు, విద్య, మహిళల గురించి పోరాటం చేసిన మహనీయుడు బసవేశ్వరుడు.
ఆ రోజుల్లోనే ప్రపంచంలోనే మొదటి పార్లమెంట్.. అనుభవ మండపాన్ని నిర్మించి.. ప్రజలకు చర్చలకు ఆహ్వానించి.. ప్రజాస్వామ్య పద్ధతిని ఈ ప్రపంచానికి నేర్పిన మహనీయుడు బసశేవ్వరుడు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ మహనీయుడి గొప్పదాన్ని గుర్తించింది సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం నాయకులు కొట్లాడి అప్పట్లో మద్దతు ఇచ్చాం. ఎన్నో రోజులుగా డిమాండ్ ఉండే.. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించాలని, ట్యాంక్ బండ్పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎన్ని దరఖాస్తులు పెట్టినా.. ఎన్నికల నినాదాలుగా మారాయి తప్ప.. ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు పట్టించుకోలేదు.
ఎంపీ బీబీ పాటిల్.. సీఎం కేసీఆర్ను కలువగానే.. రూ.కోటితో ట్యాంక్బండ్పై పెట్టిన ఒకేఒక విగ్రహం బసవేశ్వరుడి విగ్రహం. ముఖ్యమంత్రి కేసీఆర్కు బసవేశ్వరుడు అంటే ఎంతో గౌరవం. బసవేశ్వర జయంతిని తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా జరపాలని ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే. పాఠ్య పుస్తకాల్లో బసవేశ్వరుడి చరిత్రను చేర్పించి.. రేపటి తరానికి బసవేశ్వరుడి గురించి తెలిసేలా చర్యలు తీసుకున్నది ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. లింగాయత్ సమాజానికి అనేక రకాలుగా అవకాశాలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. రెండుసార్లు ఎంపీ బీబీ పాటిల్కు అవకాశం ఇచ్చారు. డీసీఎంఎస్ చైర్మన్గా శివకుమార్కు ఇచ్చారు. బదామి శివకుమార్కు నాట్య అకాడమీ చైర్మన్గా రాష్ట్రస్థాయి పదవి, శుభ్రపద పటేల్కు బీసీ కమిషన్లో, ఉమాకాంత్ పాటిల్కు సీడీసీ చైర్మన్గా అవకాశం కల్పించారు.
అనేక మున్సిపల్ల్లో చైర్మన్ పదవులు, జడ్పీటీసీలు, ఎంపీపీలుగా ఎన్నో అవకాశాలు ఇచ్చి గౌరవించారు. హైదరాబాద్లో అత్యంత విలువైన కోకాపేటలో.. రూ.100కోట్ల విలువ భూమిని బసవేశ్వర భవన్కు సీఎం కేసీఆర్ కేటాయించారు. అంతేకాకుండా రూ.10కోట్లతో లింగాయత్ ఆత్మగౌరవ భవనానికి ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. నిధులు సరిపోకతే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తాం. ఈ ఆత్మగౌరవం పిల్లలు చదువుకోవడానికి, సమాజంలో ఐక్యత పెరగడానికి. బసవేశ్వరుడి సూక్తులను లింగాయత్ సమాజానికే కాకుండా అందరికీ చాటిచెప్పేవిధంగా ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంతో గర్వంతో చెప్పుకోవాలి. ఇటీవల లండన్కు వెళ్లినప్పుడు షాక్ అయ్యాను. జహీరాబాద్, సదాశివపేట, నారాయణఖేడ్, సంగారెడ్డి, జోగిపేట, అనేక చోట్ల బసవేశ్వరుడి విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు భవనాలు నిర్మించాం.
లండన్కు వెళ్లిన సందర్భంలో అక్కడి పార్లమెంట్ ముందు బసవేశ్వరుడి విగ్రహం కనిపించింది. నిజంగా చాలా సంతోషం అనిపించింది. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బసవేశ్వరుడికి అభిమానులున్నారు. ఆయన అనుసరించేవారు ఎందరో ఉన్నారు. బసవేశ్వరుడి భవనం ముందు గుర్రంపైనున్న బసవేశ్వరుడి నిలువెత్తు విగ్రహాన్ని పెట్టాలని, ప్రారంభోత్సవానికి తానే వస్తానని సీఎం తెలిపారు. తెలంగాణలోనే కాదు.. వివిధ రాష్ట్రాల్లో ఉండే లింగాయత్ సమాజ పెద్దలు, గురువులను పిలిచుకొని.. అద్భుతంగా భవనం ప్రారంభిద్దాం.. నేనే స్వయంగా వస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.
కర్నాటక బసవకల్యాణ్లో ఉన్న అనుభవమండపాన్ని నేను స్వయంగా చూశాను. బాల్కీ స్వామిజీ పిలిస్తే బసవకల్యాణ్కు వెళ్లి వచ్చాం. 12వ శతాబ్దంలో ఆయన ఆలోచనలు, దేశానికి, ప్రపంచానికి చూపిన మార్గం మాటల్లో చెప్పలేనిది. ఇవాళ ఆయన పేరిట బసవభవన్కు శంకుస్థాపన చేసుకోవడం సంతోషం. ఏడు సంవత్సరాల కిందట తెలంగాణ ఏంటీ.. ఈ రోజు తెలంగాణ ఎలా ఉందో ఆలోచన చేయాలి. తాగునీరు, సాగునీరు, రహదారులు, నర్సరీలు, మొక్కల పెంపకం, పారిశ్రామికీకరణ, అభివృద్ధిలో ఇలా అన్ని రంగాల్లో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు.
ఏడు దశాబ్దాల్లో జరుగని పనులను.. ఏడేళ్లలో తాగునీటి, కరెంటు సమస్యను దూరం చేశారు. 33 జిల్లాలను అభివృద్ధికి దగ్గర చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. ఓబీసీ రిజర్వేషన్ చాలా రోజుల డిమాండ్. ఎన్నో ఏళ్లుగా లింగాయత్ సమాజం పోరాటం చేస్తున్నది. సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే తీర్మానం చేసి వెంటనే.. లింగాయత్ సమాజాన్ని ఓబీసీల్లో చేర్చాలని కేంద్రానికి పంపారు. వేదికగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి, కేంద్ర నాయకత్వాన్ని చొరవ చూపి లింగాయత్ సమాజాన్ని ఓబీసీల్లో చేర్చి.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది’ హరీశ్రావు పేర్కొన్నారు.