బాన్సువాడ/ బాన్సువాడ రూరల్, జూలై 26 : మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. బాన్సువాడ పట్టణంలో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో, దేశాయిపేట్లో గ్రామస్తులు బోనాల పండుగ నిర్వహించగా.. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పుష్పమ్మ దంపతులు హాజరయ్యారు. బోనాలు ఎత్తుకొని ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మత సామరస్యంతో పరిపాలన కొనసాగాలన్నారు. మత సామరస్యానికి ప్రతీక బాన్సువాడ నియోజకవర్గమని పేర్కొన్నారు. ఒకరికొకరు పరస్పరం గౌరవించుకోవాలని కోరారు.
ఆరె కటిక సంఘ సభ్యులు తమను కుటుంబ సభ్యులుగా భావిస్తారని అన్నారు. పంటలు బాగా పండి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆషాఢ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బాన్సువాడలో నిర్వహించిన బోనాల పండుగలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, బాన్సువాడ, బుడ్మి విండో అధ్యక్షులు ఎర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, హనుమాన్ వ్యాయామశాల అధ్యక్షుడు గురు వినయ్కుమార్, మహ్మద్ ఎజా స్, ఆరె కటిక సంఘం నాయకులు వాంకారి రమే శ్, కిషన్, శ్రీనివాస్, బలరాం, దేశాయిపేట్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, సర్పంచ్ శ్రావణ్కుమార్, ఎంపీటీసీ వెంకట రమ ణ, నాయకులు భూనేకర్ ప్రకాశ్, ప్రశాంత్కుమార్, మండల నా యకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
బీడీ వర్కర్స్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తా
బాన్సువాడ టౌన్, జూలై 26: బాన్సువాడ పరిధిలోని తాడ్కోల్ గ్రామ శివారు ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన బీడీ వర్కర్స్ కాలనీలో మంగళవారం ఊర పండుగ నిర్వహించగా సభాపతి పోచారం దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీక ర్ మాట్లాడుతూ.. కాలనీలో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. రోడ్లు, డ్రైయిన్, వాటర్ కనెక్షన్ పనులు పూర్తవుతున్నట్లు తెలిపారు. ఇండ్లు నిర్మించుకోవాలనుకునే వారు అర్హులైతే డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం కింద మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి హాజరయ్యారు. సర్పంచ్ రాజమణి, మాజీ సర్పంచ్ గంగుల గంగారాం పాల్గొన్నారు.