నల్లగొండ : చేయూత పథకం పోలీస్ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపడమే కాకుండా వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నదని నల్లగొండ ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఇటీవల మరణించిన కేతేపల్లి ఏ.ఎస్.ఐ. సతీమణి లలితకు రెండు లక్షల రూపాయల చేయూత పథకం కింద చెక్కు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ధి సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని ఆయన తెలపారు.
పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో చనిపోయిన పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్ తదితరులున్నారు.