లక్నో : యూపీలో ముస్లింలపై వేధింపులు జరుగుతున్నా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నోరు మెదపడం లేదని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత ఖాసిం రయీన్ పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. రాష్ట్రంలో పెట్రోల్ పంపులను కూల్చివేయడం సహా ముస్లింలపై జరుగుతున్న వేధింపులను పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా నేతలెవరూ పట్టించుకోవడం లేదని అందుకే తాను పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నానని ఖాసిం రయీన్ పేర్కొన్నారు.
ఆజం ఖాన్ కుటుంబ సభ్యులందరినీ జైలులో పెట్టినా అఖిలేష్ యాదవ్ ఏమీ మాట్లాడలేదని, నహిద్ హసన్ను నిర్భందించినా సహిజల్ ఇస్లాం పెట్రోల్ పంపును నేలమట్టం చేసినా ఎస్పీ చీఫ్ గొంతు విప్పలేదని మండిపడ్డారు.
ముస్లింల పట్ల ఎస్పీ అధ్యక్షుడి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తాను పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నానని ఖాశిం స్పష్టం చేశారు. ఖాశిం సుల్తాన్పూర్ జిల్లా ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 273 స్ధానాల్లో గెలుపొంది తిరిగి అధికార పగ్గాలు చేపట్టగా అఖిలేష్ సారధ్యంలోని ఎస్పీ 111 స్ధానాల్లో గెలుపొంది విపక్ష స్ధానానికి పరిమితమైంది.