సూర్యాపేట : సూర్యాపేటలో కబడ్డీ స్టేడియం కూలిన ఘటనపై ఎస్పీ భాస్కరన్ స్పందించారు. పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చున్న కారణంగానే గ్యాలరీ కూలిందని చెప్పారు. గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చూస్తున్నాం. పరిస్థితి విషమంగా ఉంటే హైదరాబాద్కు తరలిస్తున్నామని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.