ఎయిర్ డెక్కన్ సంస్థ అధినేత గోపినాథ్ జీవితగాధ ఆధారంగా సుధా కొంగర తెరకెక్కించిన చిత్రం సూరరై పోట్రు. సూర్య, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలలో 2డీ ఎంటర్టైన్మెంట్స్, సిఖ్యా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలై పెద్ద విజయం సాధించింది. అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమాకు మంచి వ్యూస్ వచ్చాయి.
చాలా విభాగాల్లో ఆస్కార్కు ఎంపికైన సూరారై పొట్రు నామినేషన్స్ దాటి రెండో రౌండ్కు అర్హత సాధించలేకపోయింది. సైమాలో మాత్రం ఈ చిత్రం ఏడు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది. ఉతమ నటుడిగా సూర్య, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకులు సుధా కొంగర, ఉత్తమ నటి(క్రిటిక్స్) అపర్ణ బాల, ఉత్తమ సంగీత దర్శకులు జీవీ ప్రకాశ్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్.. నికేత్ బొమ్మి, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ హరీష్ శివరామకృష్ణన్ లకి సూరరై పోట్రు సినిమాకు గాను సైమా అవార్డ్ దక్కింది.
అల్లు అర్జున్ “అల వైకుంఠపురంలో” చిత్రానికి ఏకంగా 10 అవార్డులు రావడం విశేషం. సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ నటించిన “మహర్షి” సినిమా సైమా 2021 అవార్డ్స్ ఫంక్షన్ లో ఐదు అవార్డులు దక్కించుకుంది.