యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం వాసాలమర్రిని సందర్శించారు. పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామస్తులతో సమావేశం అయ్యేందుకు అనుకూలమైన వేదిక స్థలం, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. కొద్దిరోజుల క్రితమే గ్రామంలో పర్యటించిన కలెక్టర్ గ్రామంలో జీవన స్థితిగతులపై కులాల వారీగా గణాంకాలను సిద్ధం చేసి ఉంచాలని అధికారులకు సూచించారు.
తాజా పర్యటన నేపథ్యంలో మరోసారి కలెక్టర్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. సీఎం పర్యటన విజయవంతంపై చర్చించారు. మరో వైపు ప్రత్యేక భద్రతా బలగాలు సైతం వాసాలమర్రిలో భద్రతా చర్యలను పర్యవేక్షించాయి. సీఎం రెండు రోజుల్లో వాసాలమర్రికి వచ్చే అవకాశం ఉందని, ఏ రోజు వస్తారన్న దానిపై అధికారిక సమాచారం లేదని అధికారులు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి..
పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం
అభివృద్ధి పనుల్లో అలసత్వంపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
ఆమె ఫిర్యాదుతో సువేందు అధికారిపై కేసు నమోదు
మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే
నేరేడ్మెట్ పోలీసు స్టేషన్కు గద్దర్
వెయ్యి మొక్కలు నాటించిన మంత్రి పువ్వాడ