అమరావతి, జూలై : సినీ నటుడు సోనూసూద్ తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ఈరోజు ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జిల్లా వైద్యశాల లో ఈ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు.
కోటి యాభై లక్షల రూపాయల నిధులతో తన సొంత పౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాన్ని జిల్లాకు చెందిన దివ్యాంగురాలు నాగలక్ష్మి చేతులమీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జిల్లా కలెక్టర్ చక్రధర బాబు,జిల్లా జాయింట్ కలెక్టర్ స్థానిక ఆర్డీవో ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ ద్వారా సోనూసూద్ ఇక్కడి అధికారులతో మాట్లాడారు.