కరోనా కష్టకాలంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గత ఏడాది క్లిష్ట సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన సోనూసూద్ ఇప్పుడు కూడా తన వంతు సాయాన్ని చేస్తున్నారు. ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న రోగులకు వెంటనే ఆక్సిజన్ సిలీండర్స్ తెప్పించి ప్రాణాలు కాపాడుతున్నారు. అయితే రానున్న రోజులలో కరోనా వేవ్ ఎంత విలయం సృష్టిస్తుందో ఎవరికి అర్ధం కావడం లేదు.
ముందుస్తు ప్రణాళికగా సోనూసూద్ కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలనే సంచనల నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్ దేశానికి ఇప్పటికే ఓ ఆక్సిజన్ ప్లాంట్ ఆర్డర్ చేసిన సోనూసూద్ మరో రెండు వారాల్లో మనదేశానికి తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. వివిధ దేశాల వారితో కూడా మాట్లాడి ఆక్సిజన్ ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు సోనూ తన సోషల్ మీడియా అకౌంట్లో తెలిపారు. ఎప్పుడైన తన వంతు సాయం అందించేందుకు నేను , నా టీం సిద్ధంగా ఉన్నామని సోనూ అంటున్నారు.