కరోనా కష్టకాలంలో ఆపద్భాందవుడిలా అనాధనలను చేరి చేసి వారి గుండెల్లో దేవుడిలా కొలువై తీరాడు సోనూసూద్. కరోనా రాక ముందు సోనూసూద్ ఒక నటుడిగానే మనందరికి తెలుసు. కాని కరోనా సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన సేవలకు ప్రభుత్వం కూడా ప్రశంసలు కురిపించింది. తాజాగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ ఫొటోలను ముద్రించారు. ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూసూద్ అనే క్యాప్షన్ వేశారు.
దేశీయ విమాన సంస్థ సొంత ఖర్చుతో ఓ వ్యక్తికి ఇలా గౌరవం ఇవ్వడం మొదటిసారి. తనకు దక్కిన ఈ గౌరవం పట్ల సోనూసూద్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో సోనూసూద్ స్పైస్ జెట్తో కలిసి 2.5 లక్షల మంది భారతీయులను విదేశాల నుండి స్వస్థలాలకు చేర్చిన విషయం తెలిసిందే.