‘బిగ్బాస్’ ఫేమ్ సయ్యద్ సొహెల్ హీరోగా మైక్ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడు. అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, అభిషేక్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అప్పిరెడ్డి చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ “జార్జిరెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ విజయాల తర్వాత మా సంస్థలో రూపొందుతున్న చిత్రమిది. ఇండియన్ స్క్రీన్పై ఇప్పటివరకు రాని సరికొత్త కథాంశంతో రూపొందిస్తున్నాం. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నాం. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నిజార్ షఫీ.