హైదరాబాద్ : సోషల్ వెల్ఫేర్ గురుకలాల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్లో ప్రవేశం (RJC CET-2022 ) నిర్వహించిన ఎంట్రెన్స్ ఫలితాలు విడదలయ్యాయి. కరీంనగర్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి ఫలితాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు. మొత్తం 19,360 సీట్ల భర్తీ కోసం ఫిబ్రవరి 20న ప్రవేశ పరీక్ష నిర్వహించగా.. 60,173 మంది విద్యార్థినీ విద్యార్థులకు పరీక్షకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మెరిట్ సాధించిన విద్యార్థులు ఈ నెల 11 నుంచి 21 తేదీ వరకు తమకు కేటాయించిన కాలేజీలో చేరాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కుల, ఆదాయ, బదిలీ, స్టడీ సర్టిఫికెట్స్తో విద్యార్థులు సకాలంలో హాజరు కావాల్సి ఉంటుందని సొసైటీ జాయింట్ సెక్రెటరీ శక్రు నాయక్ తెలిపారు. విద్యార్థులు మరిన్ని వివరాల కోసం tswreis.ac.in, tswrjc.cgg.gov.in వెబ్సైట్స్ను చూడాలని అధికారులు సూచించారు.