కోల్కతా: అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో పశ్చిమబెంగాల్ ప్రచారం జోరందుకుంటున్నది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతోపాటు, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ బీజేపీ తరఫున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారం కోసం బెంగాల్కు వెళ్లిన ఆమె.. ఇవాళ దక్షిణ 24 పరగణాల జిల్లా పాంచ్పోటా ఏరియాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోకు హాజరైన ఓటర్లను ఉద్దేశించి ఆమె.. బీజేపీకే ఓటు వేయాలని కోరుతూ ముందుకు సాగారు.