మెండోరా, ఆగస్టు 3 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 17,210 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి 1088.00 అడుగుల (76.424 టీఎంసీలు) నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈఈ వివరించారు.