హైదరాబాద్: నగర శివార్లలోని పటాన్చెరు (Patancheru) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఐనోల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఓ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పటాన్చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. బాధితులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.