మొన్నటికి మొన్న అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఐఏఎస్ పూజా సింఘాల్ గురించి విన్నాం, కుక్కతో వాకింగ్ కోసం స్టేడియాన్నే ఖాళీ చేయించిన ఐఏఎస్ రింకూ దుగ్గా దర్పాన్ని చదివి విస్తుపోయాం. అయితే, ప్రజల కోసం అహర్నిశలు పాటుపడే ఐఏఎస్లు కూడా ఉన్నారని నిరూపిస్తున్న ఈ కలెక్టరమ్మ పేరు జల్లి కీర్తి. తెలంగాణ బిడ్డే. ఉమ్మడి వరంగల్ జిల్లా తరిగొప్పుల స్వస్థలం.
అస్సాంలోని కఛార్ జిల్లాలో ప్రస్తుతం కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల వరదలతో జిల్లాల్లోని పలు ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ఇలా బురద నేలలోనే కీర్తి ఇంటింటికీ వెళ్లి బాధితులను కలిశారు. మన కలెక్టరమ్మపై జాతీయ మీడియా సహా నెట్టింట్లో ప్రశంసల వర్షం కురుస్తున్నది.
-దిస్పూర్