ముంబై ,మే 4: బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. నిన్న దాదాపు రూ.600 పెరిగి రూ.47,300 దాటిన 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్, ఇవాళ అతి స్వల్పంగా క్షీణించాయి. దీంతో రూ.47,300 దిగువకు వచ్చాయి. నిన్న రూ.2వేలకు పైగా పెరిగిన గోల్డ్ నేడు దాదాపు స్థిరంగా ఉంది. వెండి రూ.70వేల సమీపానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 1790 డాలర్ల దిగువకు వచ్చింది. గత ఏడాది ఆగస్ట్ 56,200తో బంగారం ధర ప్రస్తుతం రూ.9,000 తక్కువగా ఉంది. గత నెలలో ఓ సమయంలో రూ.12,000కు పైగా కూడా తగ్గింది. ఈ కాలంలో పసిడి రూ.3,000కు పైగా పెరిగింది.