హైదరాబాద్,జూన్ 26:నేరేడు పండ్లు అందరూ తినొచ్చా..? అంటే తినకూడదనే సమాధానం వస్తుంది. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలున్నవారికి ఈ పండు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చక్కెర వ్యాధి లేదా క్యాన్సర్ వ్యాధి నివారణకు చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా చాలా రకాల వ్యాధులకు చక్కటి ఔషధంకూడా. దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఔషధ లక్షణాల ఆధారంగా దీనిని ఆయుర్వేదం, హోమియోపతిలలో కూడా ఉపయోగిస్తున్నారు. కానీ అధిక వినియోగం వల్ల చాలా అనర్థాలు కూడా ఉన్నాయి. అవేంటంటే…
-ఖాళీ కడుపుతో లేదా పాలు తాగిన తరువాత తినకూడదు.
-నేరేడు పెద్ద మొత్తంలో తినడం వల్ల జ్వరం, శరీర నొప్పి, గొంతు సమస్య వస్తుంది.
-నేరేడు శరీరంలో వాత దోషాన్ని తీవ్రతరం చేస్తుంది. అధిక స్థాయిలో వాతం ఉన్నవారు ఈ పండు తినకుండా ఉండటమే మేలు.
-నేరేడు అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తే అవకాశం ఉంది.గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా లేకుండా నేరేడు తినకూడదు.
-నేరేడు పండు తీసుకోవడం వల్ల సహజంగా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. కనుక శస్త్రచికిత్సకు ముందు లేదా వీటిని తినడం మానుకోవాలి.