విమర్శకుల నోళ్లు మూయించిన ఘనత కేసీఆర్దే
కూడవెల్లికి గోదావరి జలాలు రావడం మరిచిపోలేని సంఘటన
మండుటెండల్లో ఇదో కొత్త అనుభూతి
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
దుబ్బాక, మార్చి 28 : మండుటెండల్లో కూడవెల్లి వాగు నిండుగా పారడం, ఈ వాగులో గోదావరి జలాలను చూసే అదృష్టం దక్కడానికి కారణం సీఎం కేసీఆర్ అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నిజంగా ఇదొక అద్భుత ఘట్టమని, కలలో సైతం ఊహించని మహా కార్యమని ఆయన పేర్కొన్నారు. దుబ్బాక మండలం కూడవెల్లి రామలింగేశ్వరాలయం పక్కన ప్రవహిస్తున్న గోదావరి జలాలకు ఆదివారం మధ్యాహ్నం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీకి రామలింగేశ్వరాలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వాగులో గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. అమ్మవారికి జ్యోతి వెలిగించి, పండ్లు చీర సారెలను సమర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. విలేకరులతో ఎంపీ ప్రభాకర్రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కారు అంటేనే చేతల ప్రభుత్వం అన్నారు. దుబ్బాకకు నీళ్లు రావాలంటే ఎంతో కష్టంతో కూడినదన్నారు. ఎన్నో కష్టాలను ఓర్చి సీఎం కేసీఆర్ సహకారంతో కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను తెచ్చామన్నారు. సిద్దిపేట జిల్లాలో ఏ చెరువు చూసినా.. ఏ కుంట చూసినా.. నిండుకుండలా కనిపిస్తుంది. కూడవెల్లి వాగు జలకళ తెచ్చిన సీఎం కేసీఆర్కు దుబ్బాక నియోజకవర్గ ప్రజల తరపున ఎంపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దుబ్బాకలో ఎమ్మెల్యే తప్పా అంతా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే..
దుబ్బాకను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుంటామని మెదక్ ఎంపీ ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాకలో తాను పర్యటించడం కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని, ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మినహా మిగిలిన వారంతా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులేనని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేనంత మాత్రాన ఓరిగేదేమిలేదన్నారు. నియోజకవర్గంలో ఒక్కో సర్పంచ్ ఒక్కో ఎమ్మెల్యేగా పని చేస్తున్నారని తెలిపారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటామన్నరు. కార్యక్రమంలో జడ్పీటీసీ రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కైలాశ్, టీఆర్ఎస్ నాయకులు రొట్టె రాజమౌళి, ఆస యాదగిరి, కిషన్రెడ్డి, మల్లారెడ్డి, దయాకర్, రమేశ్, కుమార్, శంకర్, శ్రీనివాస్రెడ్డి, నారాగౌడ్, తిరుపతిరెడ్డి, కిషన్, నగరం రవి, చంద్రసాగర్, మల్లేశం పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
విటమిన్ మాత్రలు తీసుకుంటున్నారా!