అందుబాటులో రైతువేదిక,డంపింగ్ యార్డు, వైకుంఠధామం
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం
రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు
సమష్టి నిర్ణయాలతో అభివృద్ధి వైపు అడుగులు
రాయపోల్, మార్చి 19 : పెద్దఆరెపల్లిలో రెండేండ్లలో వీధివీధినా డ్రైనేజీలు నిర్మించారు. హరితహారంలో భాగంగా ముమ్మరంగా
మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతి వనంతో పాటు రైతు వేదిక ఇలా.. పలుఅభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామంలో ఇండ్లు 303 ఉండగా, వందశాతం ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించారు.శిథిలావస్థ ఇండ్లు కూల్చివేశారు. పాడుబడ్డ బావులను పూడ్చివేశారు. దీంతో అక్కడ జాగ ఏర్పడడంతో పంచాయతీకిఉపయోగపడుతున్నది. గ్రామంలో పంచాయతీ ట్రాక్టర్ ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి,డంపింగ్ యార్డుకు తరలిస్తున్నది. ట్యాంకర్తో హరితహారం మొక్కలకు నిత్యం నీళ్లు పడుతుండడంతో అవి ఏపుగా పెరిగి,గ్రామానికి పచ్చందాలను తీసుకొస్తున్నాయి. పల్లెప్రకృతి వనంలో పండ్లు, పువ్వులు, వివిధ రకాల మొక్కలను నాటి గ్రామస్తులుసేదతీరేలా సిమెంట్ బెంచీలు, వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేశారు. ప్రతి వీధిలో స్ట్రీట్ లైటు ఏర్పాటు చేయగా, రాత్రిపూటవెన్నెలలా కనిపిస్తున్నది. గ్రామంలో 10డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించగా, వాటిని త్వరలోనే ప్రారంభించనున్నారు. సర్పంచ్తోపాటు జీపీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు భాగస్వాములు కావడంతో అభివృద్ధి వైపు పెద్దఆరెపల్లి పరుగులు తీస్తున్నది.
గ్రామంలో చేపట్టిపన పనులు..
పెద్దఆరెపల్లి గ్రామంలో రూ.2.50లక్షలతో డంపింగ్ యార్డు, రూ.12.50 లక్షలతో వైకుంఠధామం, రూ.22లక్షలతో రైతువేదిక,రూ.1.50లక్షలతో పల్లె ప్రకృతి వనం నిర్మించారు. రూ.10లక్షలతో గ్రామంలో ప్రధాన వీధులను సీసీగా మార్చారు.
దాతల సహకారంతో..
గ్రామంలో దాతలు, గ్రామస్తుల సహకారంతో రూ.5 లక్షలతో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ను ఏర్పాటుచేశారు. అంతకు ముందు శుద్ధ తాగునీటి కోసం అటు గజ్వేల్ లేదా ఇటు రాయపోల్కు వెళ్లాల్సి వచ్చేది. ప్లాంట్ ఏర్పాటుతోఆ ఇబ్బందులు పోయాయి. అలాగే, గ్రామ ప్రధాన చౌరస్తా, బస్టాండ్ వద్ద స్థానికులు, ప్రయాణికులు కూర్చోవడానికి 10సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు.