సిద్దిపేట జోన్/సిద్దిపేట అర్బన్, మార్చి 19 : సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా మండల, జిల్లాపరిషత్లకు బడ్జెట్లో రూ.500కోట్లు కేటాయించామని, స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులోనిసుభాష్నగర్, పద్మానగర్, శ్రీరాంనగర్, ఇందిరానగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రూ.20లక్షలతో నిర్మిస్తున్నప్రహరీ నిర్మాణానికి, రూ.30లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కాళ్లకుంట కాలనీలోరూ.20లక్షలతో నిర్మించిన ముస్లిం కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. సీసీరోడ్లకు శంకుస్థాపన చేశారు. 9వ వార్డురంగధాంపల్లిలో సుతారిసంఘం, మహిళా మండలి భవనాలను మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, జిల్లా రైతుబంధు సమితిఅధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు శ్రీనివాస్యాదవ్, బర్ల మల్లికార్జున్, ఉమారాణిఐలయ్యయాదవ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడాలేనివిధంగా సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని కుల సంఘాలకు భవనాలు నిర్మించామన్నారు. ఒక్క రంగధాంపల్లిలోనే 12కమ్యూనిటీ భవనాలు నిర్మించామన్నారు. రూ.9కోట్లతో రంగధాంపల్లిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని లక్ష్యంతో సీఎం కేసీఆర్ చొరవతో బడ్జెట్లో నిధులు కేటాయించామన్నారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు రూ.699కోట్లు కోత పెడితే, రాష్ట్ర ప్రభుత్వం నిధులుకేటాయించి కడుపు నింపిందన్నారు. సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చాయనిమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి ద్వారా గ్రామాల అభివృద్ధికి ప్రతినెలా రూ.300కోట్లు ఖర్చుచేస్తున్నదన్నారు. త్వరలోనే మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ఐటీ పార్కుకు నిధులుకేటాయించామని, మిట్టపల్లి, మందపల్లి, ముండ్రాయి పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా ఈప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం గ్రామాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయని,టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పార్టీలకతీతంగా స్థానిక సంస్థలకు నిధుల కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు.
పల్లెప్రగతి ద్వారా నెలనెలా రూ.300కోట్లను ప్రభుత్వం ఇస్తున్నదని, ఈ రోజు ప్రతిపల్లెకు ట్రాక్టర్లు, డంపింగ్యార్డు,వైకుంఠధామం, నర్సరీ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. పట్టణాల అభివృద్ధికి ప్రతినెలా రూ.148కోట్లనుప్రభుత్వం అందిస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల్లో రూ.699కోట్లను కోతపెడుతుందని, సీఎం కేసీఆర్ చొరవతో స్థానిక సంస్థల అభివృద్ధి నిరాటంకంగా జరుగాలనే లక్ష్యంతో ప్రతినెలా నిధులువిడుదల చేస్తున్నట్లు తెలిపారు. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.500కోట్లు కేటాయించిందన్నారు. పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్మార్కెట్ల నిర్మాణానికి, వైకుంఠధామాల నిర్మాణాలకు నిధులు బడ్జెట్లో కేటాయించినట్లు తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీలు,జడ్పీటీసీలు సమన్వయంతో పనిచేసి నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట పట్టణం ఇతరపట్టణాలకు ఆదర్శంగా ఉందని, త్వరలోనే రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తిచేస్తామని, రైల్వేసేవలు అందుబాటులోకి వస్తే గోదాంలు,పరిశ్రమలు వస్తాయని, రంగధాంపల్లి ఏరియాలో మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు రానున్నాయని మంత్రి తెలిపారు. సిద్దిపేటపట్టణాన్ని నలుదిక్కులా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో వైస్ చైర్మన్ అక్తర్పటేల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ ముత్యాల కనకయ్య, కౌన్సిలర్లు గ్యాదరి రవీందర్,టీఆర్ఎస్ నాయకులు సురేశ్, శ్రీనివాస్గౌడ్, గిరియాదవ్, తిరుమల్రెడ్డి, దుర్గారెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.
కులసంఘ భవనాలు ఆత్మ గౌరవానికి ప్రతీకలు..
కులసంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీకలని, సిద్దిపేటలో ప్రతి కుల సంఘానికి భవనాలు నిర్మించామని మంత్రి హరీశ్రావుఅన్నారు. రూ.40 లక్షలతో సిద్దిపేట పట్టణంలోని రేణుకానగర్లో నిర్మించిన సిద్దిపేట పట్టణ పూసల సంఘం కృష్ణ బలిజభవనాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పూసల సంఘ భవనం ఆత్మగౌరవానికిప్రతీకగా నిలుస్తున్నదని, సంఘ నిర్వహణను బాధ్యతతో నిర్వర్తించాలన్నారు. ఈ భవనాలు ప్రేరణ, ఐక్యతనుపెంపొందిస్తాయని తెలిపారు. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రూ.500కోట్లను బడ్జెట్లో కేటాయించామన్నారు. ఇప్పటికేసిద్దిపేటలో ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికీ రూ.50వేల రుణాలను అందించామన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారావ్యాపార అభివృద్ధి కోసం స్వయం ఉపాధి రుణాలను పొందాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించాలనిసూచించారు. కార్యక్రమంలో పూసల సంఘం నాయకులు వెంకటేశం, కోటయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశంతో పాటు మాజీసర్పంచ్ సత్యం తదితరులు పాల్గొన్నారు.నాచారం లక్ష్మీనర్సింహస్వామిఉత్సవాల పత్రిక ఆవిష్కరణ..గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం నాచారం లక్ష్మీనర్సింహస్వామి ఉత్సవాల పత్రికను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరుప్రతాప్రెడ్డితో పాటు దేవస్థాన పాలకమండలి సభ్యులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు.