నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో తెలుగులో మంచి హిట్టు అందుకున్నాడు సిద్దార్థ్ (Siddharth). ఆ తర్వాత చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు సినిమాలతో ఫ్యాన్ ఫాలోయింగ్తోపాటు క్రేజ్ కూడా పెంచేసుకున్నాడు. వీటితోపాటు చాలా చిత్రాల్లో నటించి తెలుగులో తీసుకున్నాడు. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి డైరెక్షన్లో మహాసముద్రంతో తెలుగు ఆడియెన్స్ ను పలుకరించాడు. ఈ చిత్రంలో అదితిరావు (Aditi Rao), అనూ ఇమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించారు.
ఈ క్రేజీ యాక్టర్కు సంబంధించిన ఓ వార్త ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సిల్వర్ స్క్రీన్పై కలిసి సందడి చేసిన సిద్దార్థ్, అదితీరావు హైదరీ ఇపుడు ప్రేమలో ఉన్నట్టు ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఇద్దరూ ముంబైలో కలిసి కనిపించగా..అక్కడే ఉన్న కెమెరామెన్లు ఫొటో తీసేందుకు ప్రయత్నించారు. అయితే సిద్దార్థ్ ఫొటో తీయొద్దని చెబుతుంటే..మరోవైపు అదితీరావు మాత్రం హ్యాపీగా వారికి పోజులిచ్చింది.
అంతేకాదు రిలేషన్ షిప్ లో ఉన్న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకునే సన్నాహాలు కూడా చేస్తున్నారంటూ ఓ క్రేజీ గాసిప్ ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తుండగా..అలాంటిదేమి లేదంటూ మరో వార్త కూడా హల్ చల్ చేస్తోంది. సినీ పరిశ్రమలో ఇలాంటి వార్తలు సర్వసాధారణమని తెలిసిందే. మరి తాజా న్యూస్పై సిద్ధార్థ్ కానీ, అదితీ రావు కానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలంటున్నారు సినీ జనాలు.