హైదరాబాద్: నగరంలోని మారేడుపల్లి ఎస్ఐ వినయ్కుమార్పై దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ వినయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బైక్పై వస్తున్న ఇద్దరిని ఆపిన ఎస్ఐ.. వారిని ప్రశ్నించారు. అయితే వారిలో ఓ వ్యక్తి తనవద్ద ఉన్న చిన్న కత్తితో ఎస్ఐ వినయ్కుమార్ కడుపులో పొడిచాడు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు.
దీంతో తీవ్రంగా గాయపడిన ఎస్ఐని సిబ్బంది సమీపంలోని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా, వారంరోజుల క్రితం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. దొంగల పట్టుకునేందుకు మఫ్టీలో మాటువేసిన సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, గిరిపై దుండగులు కత్తిలో దాడిచేశారు. ఈ దాడిలో హెడ్కానిస్టేబుల్ యాదయ్య తీవ్రంగా గాయడ్డారు. ప్రస్తుతం ఆయన దవాఖానలో చికిత్స పొందుతున్నారు.