టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ ఈ మథ్య సినిమాల కన్నా కూడా తన పర్సనల్ టూర్ విషయాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. తన భర్త ఆండ్రో కొశ్చేవ్తో కలిసి చెట్టా పట్టాలు వేస్తూ అక్కడ వారు చేసే రచ్చకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరు నోరెళ్లపెట్టేలా చేస్తుంది.
తాజాగా నటి శ్రియ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న శ్రియ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా స్వామిని దర్శించుకోలేకపోయానని పేర్కొంది.
తిరుమలకు వెళ్లిన శ్రియ దంపతులు తమ కొంటె పనులని ఆపలేదు. ఆండ్రీ కొశ్చేవ్ ఆలయం ముందు శ్రియకి ముద్దు పెట్టి తన ప్రేమను వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం)లో అజయ్ దేవగణ్కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో శ్రియతో పాటు కథానాయకుడు శివకందుకూరి, మరో కథానాయిక ప్రియాంక నటిస్తున్నారు.