న్యూఢిల్లీ : కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా శ్రీపాద్ నాయక్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు పర్యాటక, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖల బాధ్యతలు అప్పగించారు. 2014లో కొత్తగా ఆయూష్ మంత్రిత్వశాఖ ఏర్పాటైన నాటి నుంచి ఆయన మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. ఈ నెల ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణ చేపట్టగా.. ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు, విద్యాశాఖమంత్రిగా ధర్మేంద్ర ప్రసాద్, పౌర విమానయాన శాఖ మంత్రిగా జ్యోతిరాధిత్య సింధియాకు బాధ్యతలు అప్పగించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కొంత మంది మంత్రులను తొలగించగా.. కొత్తవారిని కేబినెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే.