తెలుగు నుంచి బాలీవుడ్ వెళ్లి పేరు తెచ్చుకున్న నాయిక శ్రేయా ధన్వంతరి. ‘జోష్’, ‘స్నేహ గీతం’ వంటి చిత్రాల్లో నటించిన శ్రేయా..హిందీలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్లు చేసి ఫేమస్ అయ్యింది. ‘వై ఛీట్ ఇండియా’, ‘లూప్ లపేటా’ చిత్రాలు ఆమెకు మరింత గుర్తింపు తీసుకొచ్చాయి. ఇటీవల శ్రేయ నటించిన ‘చుప్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా ఒక వైవిధ్యమైన ప్రయత్నంగా ప్రశంసలందుకుంది. తాజాగా తన కెరీర్ గురించి శ్రేయా ధన్వంతరి మాట్లాడుతూ…‘ద ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992 వెబ్ సిరీస్లు నన్ను ప్రేక్షకులకు దగ్గరచేశాయి. అయినా ఇప్పటికీ నటిగా నేనేదో సాధించానని అనుకోవడం లేదు. ఈ పరిశ్రమలో నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. సుదీర్ఘ ప్రయాణం చేయాలి. కెరీర్లో ప్రేక్షకాభిమానం సంపాదించుకోవాలి’ అని చెప్పింది.