అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమను కించపరిచే విధంగా వ్యవహరించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. సినీ పరిశ్రమపై సమస్యలు సృష్టించి సినిమా హీరోలను అవమాన పరిచారని ఆరోపించారు. స్వశక్తితో ఎదిగిన చిరంజీవి లాంటి వారు ఏపీ సీఎం జగన్ వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలని ప్రాధేయపడలా అని ప్రశ్నించారు. ప్రపంచ స్థాయికి ఎదిగిన సినీ పరిశ్రమను జగన్ కించపరిచారని ఆరోపించారు.
ఈరోజు టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు వ్యూహ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై వైసీపీ ప్రభుత్వం పలాయనవాదాన్ని ఎంచుకుందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలపై సవాళ్లు విసిరన వారు నేడు ఏం చేస్తున్నారని నిల దీశారు. అజెండాలో హోదా తమ ఘనతే అని చెబుతూనే టీడీపీపై బురద వేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆదాయం తగ్గకపోయినా ఏపీ ఆర్థిక వ్యవస్థను నాశనంచేశారని దుయ్యబట్టారు. ఈశాన్య రాష్ట్రాల కంటే దారుణంగా ఏపీని దిగజార్చరని విమర్శించారు.