హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఇవాలో, రేపో కషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. పార్టీ మారుతున్న విషయాన్ని తన అనుచరులకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డికి నష్టం జరగకుండా ఉండాలనే ఇంతకాలం పార్టీ మారలేదని ఎన్నికల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొండా స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విశ్వేశ్వర్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కు రాజీనామా లేఖను పంపించారు.