భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తన సతీమణితో కలిసి ఇవాళ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని భార్యతో కలిసి మొక్కలు నాటానని శివరాజ్సింగ్ తెలిపారు. అదేవిధంగా నేను రోజుకో మొక్క నాటుతాను, మీరు కూడా ఏడాదికి ఒక్కటైనా నాటండి అంటూ తాను చేపట్టిన సోషల్ క్యాంపెయిన్ను కొనసాగిస్తున్నానని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన సూచించారు.