ప్రగతిశీల సమాజ్వాదీ అధ్యక్షుడు, అఖిలేశ్ బాబాయ్ శివపాల్ యాదవ్ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేత, శివపాల్ కుమారుడు ఆదిత్య యాదవ్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ సూచన మేరకు అన్ని స్థాయిల్లో వున్న కమిటీలను రద్దు చేస్తున్నాం అని ప్రకటించారు. తన రాజకీయ జీవితంలో ఓ ముఖ్య నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని, త్వరలోనే ఆయన బీజేపీలో చేరిపోతున్నారని, అందుకే అన్ని కమిటీలను రద్దు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల సమయంలో ఒక్కటైన బాబాయ్, అబ్బాయ్, ఫలితాల తర్వాత మళ్లీ వీరిద్దరి మధ్యా దూరం పెరిగిపోయింది. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు శివపాల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఓ రెండు మూడు రోజుల తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన సీఎం యోగితో భేటీ అయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరిపోతున్నారన్న ఊహాగానాలు అప్పటి నుంచి పెరిగాయి.
Shivpal Singh Yadav's Pragatisheel Samajwadi Party (Lohia) dissolved all its state working committees, national and state working cells and spokespersons. pic.twitter.com/52Hmk2Mqnf
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 15, 2022